కాజీపేట, సెప్టెంబర్14 (ప్రజాజ్యోతి) కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో పట్టుబడ్డ వారికి బుధవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప ముగ్గురికి జైలు శిక్ష విధించారని కాజీపేట ట్రాఫిక్ సిఐ కే రామకృష్ణ తెలిపారు. జైలు శిక్ష విధించబడిన తోట అశోక్, గాజే భద్రయ్య, రాజ్ కుమార్ లను మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించామన్నారు. అలాగే కోర్టు మరో 8 మందికి 9200 రూపాయల జరిమానా విధించారని సీఐ తెలియజేశారు
- 28 views