మునుగోడులో బిజెపి జెండా ఎగరడం ఖాయం

Submitted by mallesh on Sun, 04/09/2022 - 11:51
The BJP flag is sure to fly in Munugod

చౌటుప్పల్ సెప్టెంబర్ 3 ప్రజా జ్యోతి ; మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు రమన గొని శంకర్ దిమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెం లో నిర్వహించిన, 43 వ భుత్ కార్యకర్తల సమావేశానికి, ముఖ్య అతిధులుగా రమన గొని శంకర్, మొగుదాల రమేష్ గౌడ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొగుదాల రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూతు స్థాయిలో 60 శాతం ఓట్లు సాధించేలా కృషి చేసి, రాజగోపాల్ రెడ్డి నీ అత్యధిక మెజార్టీతో  గెలిపించి, బిజెపి పార్టీ సత్తా చూపించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు ఉడుగు వెంకటేష్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, గుజ్జుల సురేందర్ రెడ్డి, బొంగు రాజు గౌడ్, కందాల వెంకట్ రెడ్డి, శివప్రసాద్ , బొదుల యాదయ్య, ప్రవీణ్, అచ్చయ్య, బొమ్మి రెడ్డి సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు