- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎస్సి కాలనీలో దళితులను కించపరిచేలా మాట్లాడిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎస్ ఐ స్రవంతి రెడ్డి వ్యాఖ్యలను నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు, ఒక బాధ్యత గల స్థాయిలో ఉండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులే ఇలా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు.
ఇలా ఒక్కరి నోటిదురుసు వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇలాంటి చర్యల వల్ల పోలీసులపై జనాలకు నమ్మకం సన్నగిల్లే అవకాశాలున్నాయని ఆయన వాపోయారు, బాధ్యతారహితంగా మాట్లాడిన ఎస్సై స్రవంతి రెడ్డిని వెంటనే విధుల్లో నుండి తీసెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు..
- 7 views