చౌటుప్పల్ సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి రాజగోపాల్ రెడ్డి నీ నమ్మి, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే, గెలిపించిన ప్రజల మనోభావాలను గాలికి వదిలేసారని 22 వేల కోట్ల రూపాయలకు, అమ్ముడు పోయారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు.
ఆదివారం దేవలమ్మ నాగారం గ్రామంలో నిర్వహించిన, ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిథులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, ఇందిరమ్మ ఇల్లు, దళితులకు భూములు పంపిణీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.
కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ తాను అండగా ఉంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నరసింహ గౌడ్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు బోయ రామచంద్రర్, లండగిరి భీమయ్య, ఉదరి శ్యాంసుందర్ , ఉదరి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ బొమ్మ మైసయ్య, మాజీ ఎంపిటిసి మల్కాపురం నరసింహ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జక్క యాదిరెడ్డి, వార్డ్ మెంబర్ బొమ్మ లింగస్వామి, బొమ్మ తిరుమలేష్, బొమ్మ మహేష్ ,బొమ్మ రాములు, పులిగిల్ల రామ్, కొండ గణేష్, తదితరులు పాల్గొన్నారు.
- 6 views