ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి
చౌటుప్పల్ సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి ..మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్రవంతి రెడ్డి రెడ్డి నియమకం అనంతరం మంగళవారం మొట్టమొదటిసారి నియోజకవర్గం చౌటుప్పల్ లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్వాయి స్రవంతి కి ఘన స్వాగతం పలికారు. దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వీరనారి చాకలి ఐలమ్మ, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బొమ్మగాని ధర్మ బిక్షం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.