ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Submitted by mallesh on Tue, 06/09/2022 - 14:09
Teacher's Day Celebrations

చౌటుప్పల్  సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి.   చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రత్న నగర్ లో ఉన్న ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ సలహాదారులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు లెంకల మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి  విద్యార్థి విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలిపారు. విద్యార్థులు ఒకేషనల్ కళాశాలలో విద్యను అభ్యసించినట్లయితే తొందరగా ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యాపకు వృత్తి నుండి భారతదేశ అధ్యక్షుని వరకు అంచలంచలుగా ఎదిగారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిలివేరు ధనలక్ష్మి, ప్రిన్సిపాల్ సిలివేరు శ్రీనివాస్ ,అధ్యాపకులు కే పూజ, డీ చైతన్య, బీ దివ్య, బి మాలతి తదితరులు పాల్గొన్నారు.