చౌటుప్పల్ సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి; కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, సీఎం కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి, తెలంగాణ రాష్ట్రం ను నాశనం చేశాడని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన 18 వార్డ్ కౌన్సిలర్ కంశెట్టి శైలజ భాస్కర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు చింతల సాయిలు, చౌటుప్పల్ మాజీ వార్డు మెంబర్ కాసోజు గోవర్ధన్ చారి ,పీపల్ పహాడ్ గ్రామ సర్పంచ్ శిర్క రాణి రంగారెడ్డి లతోపాటు పలువురు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సోమవారం బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీ సాక్షిగా, నిధులు కేటాయించాలని కోరిన, నిధులు మంజూరు చేయకుండ సీఎం కేసీఆర్ మునుగోడు అభివృద్ధిని అడ్డుకున్నారన్నార.
తెలంగాణలో కుటుంబంలో పాలన సాగుతుందని,టిఆర్ఎస్ లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు సీఎం కేసీఆర్ బానిసలని విమర్శించారు. మునుగోడు గడ్డ మీద బిజెపి జండా ఎగరవేస్తానని దీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మొగుదల రమేష్ గౌడ్, పెద్దగొని రమేష్, రిక్కాల సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- 3 views