ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి

Submitted by mallesh on Wed, 14/09/2022 - 10:54
Congress party candidate Sravanti who conducted special pooja

చౌటుప్పల్ సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి  ..మునుగోడు ఉప ఎన్నిక  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా  స్రవంతి రెడ్డి రెడ్డి నియమకం అనంతరం మంగళవారం మొట్టమొదటిసారి నియోజకవర్గం చౌటుప్పల్ లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్వాయి స్రవంతి కి ఘన స్వాగతం పలికారు.  దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వీరనారి చాకలి ఐలమ్మ, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బొమ్మగాని ధర్మ బిక్షం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చానన్నారు. మునుగోడు ఆరాధ్య దైవమైన శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ అన్నారు.   ఈ కార్యక్రమంలో  తిరుపతి రవీందర్ .డిసిసి కార్యదర్శులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నరసింహ గౌడ్. మల్కాపురం నరసింహ. శ్యాంసుందర్ గ్రామ మండల శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.