చౌటుప్పల్ ఆగస్టు 30 ప్రజా జ్యోతి ; ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల ప్రజలు కుల మత వర్గ లింగ విభేదం లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలని ఎమ్మార్వో పార్థసింహారెడ్డి అన్నారు.
గురువారందేవలమ్మ నాగారం గ్రామంలో నవయుగ అంబేద్కర్ యువజన సంఘం ఆవరణంలో పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన, కార్యక్రమంలో ఎమ్మార్వో పార్థ సింహ రెడ్డి, సిఐ నేతి శ్రీనివాస్ పాల్గొని కుల వివక్షతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగాసిఐ నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ కులాలకు అతీతంగా అన్ని కులాల ప్రజలు సోదర భావంతో మెలుగుతూ అంటరాని తనాన్ని నిర్మూలించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ అంజిరెడ్డి ,అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బనాల రాంరెడ్డి, బొమ్మ మైసయ్య ఏసురి నరసింహ, పెద్ద బొమ్మ కృష్ణయ్య, వడ్డేపల్లి బుచ్చయ్య, బొమ్మ బిక్షం, చీమర్ల లింగయ్య చింతకింది రమేష్, బొమ్మ లక్ష్మయ్య, మల్కాపురం పుల్లయ్య, బొమ్మ రాములు , సిహెచ్ శ్రీనివాస్, వడ్డేపల్లి రాములు, తదితరులు పాల్గొన్నారు.