కాంగ్రెస్ పార్టీ మునుగోడు మండల ముఖ్యకార్యకర్తల సమన్వయ సమావేశం
*స్పీఎల్పీ నేత భట్టి విక్రమార్కప్రెస్ మీట్
*స్పీఎల్పీ నేత భట్టి విక్రమార్కప్రెస్ మీట్
నల్లగొండ సెప్టెంబర్12(ప్రజాజ్యోతి) మునుగోడులో జరగుతున్న నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు.నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జి సునీల్ బన్సాల్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఉప ఎన్నిక ఇంచార్జి వివేక్ వెంకటస్వామి,మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 2 ( ప్రజా జ్యోతి): మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టిఆర్ఎస్ పార్టీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల టిఆర్ఎస్ విస్తృతస స్థాయి సమావేశం పుట్టపాక గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో టిఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అబద్దాలను ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు .గత మూడేళ్లుగా రాజగోపాల్ రెడ్డి బిజెపికి కోవర్టుగా మారిపోయారని విమర్శించారు.
సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 1 ( ప్రజా జ్యోతి) మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలోని రోడ్లు అద్వానస్థితికి చేరుకున్నాయి. చౌటుప్పల్ నల్గొండ వెళ్లే ప్రధాన రహదారి తప్ప మిగతా అన్ని రోడ్లు గుంతల మయంగా మారిపోయాయి. గత దశాబ్ద కాలంగా నియోజకవర్గంలోని రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల గుంతల మయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. చౌటుప్పల్ నుంచి తంగడపల్లి వరకు అద్వాన్నంగా ఉన్న రోడ్డును ఇటీవలనే కొంతమేరకు మరమ్మతులు చేశారు.