మృతుని కుటుంబానికి చేయూత

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 12:15
 Aid to the family of the deceased

* కూసుకుంట్ల,గ్రామ సర్పంచ్ ఆర్థిక సహాయం 

మునుగోడు సెప్టెంబర్ 18 (ప్రజజ్యోతి): మునుగోడు మండల పరిధిలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన జీడిమడ్ల రమేష్ గత రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించారు. వారి భౌతికాయం పై పూలమాలలు వేసి నివాళులర్పించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తాటికొండ సంతోష సైదులు. అలాగే వారి కుటుంబ సభ్యులకు చెరొక పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తదనంతరం  ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏర్కొండ శ్రీనివాస్,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జీడిమడ్ల ధర్మయ్య, మాజీ సర్పంచ్ పాలకూరీ యాదయ్య, మాజీ సర్పంచ్ యశోద భిక్షం, మాదగోని రాములు, దేశరాజు వెంకటేశ్వర్లు, జీడిమడ్ల జలంధర్, అనంత వెంకటేశ్వర్లు, మాధగోని శంకర్, అనంత శ్రీనివాస్, జీడిమడ్ల శివరాజ్, జీడిమడ్ల స్వామి, చింతల లోకేష్ తదితరులు పాల్గొన్నారు.