మునుగోడు లో గెలిచేది టిఆర్ఎస్: విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి

Submitted by Sathish Kammampati on Sat, 03/09/2022 - 13:04
TRS won in Munugodu: Power Minister Jagdish Reddy

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 2 ( ప్రజా జ్యోతి):  మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టిఆర్ఎస్ పార్టీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల టిఆర్ఎస్ విస్తృతస స్థాయి సమావేశం పుట్టపాక గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో టిఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.  కోమటిరెడ్డి బ్రదర్స్ అబద్దాలను ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు .గత మూడేళ్లుగా రాజగోపాల్ రెడ్డి బిజెపికి కోవర్టుగా మారిపోయారని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచి కాంట్రాక్టు దక్కగానే పార్టీకి రాజీనామా చేశారని ధ్వజమెత్తారు. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ను మోసం చేయడం కోమటిరెడ్డి కి తగదన్నారు. అన్ని సర్వేలు మునుగోడు లోటిఆర్ఎస్ గెలుస్తుందని తెలుపుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు తుంగతుర్తి ఎమ్మెల్యే ఖాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ ఉత్త ఉమా ప్రేమ్చందర్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య వీరమల్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.