ఊరూరా వెలివాడలో వనభోజన కార్యక్రమాల్లో పాల్గొన్న గాదరి కిషోర్
మునుగోడు సెప్టెంబరు 28(ప్రజా జ్యోతి): తె లంగాణ పార్టీ అధ్వర్యంలో దళిత వాడలో కుటుంబ సభ్యుల వన భోజన కార్యక్రమాలు మునుగోడు మండల వ్యాప్తంగా మునుగోడు తో పాటు 10 గ్రామాల్లో నిర్వహించడం జరిగినది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పలు గ్రామాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రతి దళిత వాడల్లో కలియతిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.దళిత వాడల్లో వున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తదనంతరం మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో దళితులకు అభివృద్ధి జరుగుతుందని, దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారు.