వీఆర్ఏల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు
నేరేడు చర్ల, సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి): నేరేడు చర్ల మండల పరిధిలో తహసీల్దార్ కార్యాలయం నందు వీఆర్ఏల సమ్మె 60వ రోజుకు చేరిన సందర్భంగా, దీక్షా శిబిరాన్ని సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు.అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు వ్యవసాయ కార్మిక సంఘం తన సంపూర్ణ మద్దతు ఇస్తుందని వీఆర్ఏలకు పే స్కేలు ఇస్తామని 2017లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ సాక్షిగా ప్రకటించారని, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా రెండు సందర్భాలలో పే స్కేలు ఇస్తామని వాగ్దానం చేసి తీరా ఇప్పుడు వారిని సమ్మెబాట పట్టించారని, విరమించండి