ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యులకు బీమా చెక్కు లను అందజేసిన: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నేరేడుచర్ల, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి): నేరేడుచర్ల మండల పరిధిలోని దిర్శించర్ల గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త పార్టీలో కార్యకర్త గా ఉంటూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన గుండెబోయిన సతీష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం రెండు లక్షల రూపాయల విలువ గల చెక్కును అందజేశారు.ఈ సందర్బంగా సైదిరెడ్డీ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్ద దిక్కులా ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ కి కార్యకర్తలే పునాది అని కార్యకర్తల కొసం టీఆర్ఎస్ పార్టీ 18 కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ గా చెల్లిస్తుందన్నారు.