నేరేడు చర్ల, సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి):నేరేడు చర్ల పట్టణ పరిధిలో బుధవారం హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డీ ఆరోగ్య మిత్ర కన్సల్టెన్సీ హాస్పటల్ మరియు మెడికల్ షాపు అలాగే నేరేడు చర్ల రామాపురం రోడ్డులో తెరాస కార్యకర్త చికెన్ షాపులను ప్రారంభించారు.అనంతరం ఆచార్య కొండలక్ష్మంబాపూజి వర్దంతి సందర్భంగాఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, శ్రద్ధాంజలి ఘటించి,నివాళులు అర్పించినారు.
స్వర్గీయ కొండలక్ష్మన్ బాపూజీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని,త్యాగాలను,ఉద్యమములో తాను చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన పోరాటాన్ని కొనియాడారు.
బాలిక వైద్యానికి LOC అందజేత :
నెరేడుచెర్ల పట్టణానికి చెందిన బాలేన వెంకట కృష్ణ కూతురు నవ్య గత కొద్ది కాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స తీసుకుంటుండగా చిన్నారి వైద్యానికి ఇప్పటికే చాలా ఖర్చు అయి వైద్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతు వైద్యానికి ఇబ్బంది పడుతుండగా హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చిన్నారి నవ్య వైద్యానికి రెండున్నర లక్షల రూపాయల యల్ ఓ సి నిమంజూరు చేపించి ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీలత రెడ్డి డి సీ సి బి డైరెక్టర్ అప్పిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆనంతు శ్రీను వాస్ నారాయణరెడ్డి మాజీ సర్పంచ్ ఆకారపు వెంకటేశ్వర్లు సుందరయ్య మార్కెట్ చైర్మన్ రాములు కొనతం సత్యనారాయణరెడ్డి శ్రీధర్ ఎంపిటిసి రాజేష్ సర్పంచ్ సైదా మల్లయ్య కౌన్సిలర్లు మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు