బి.జె.పిపాలిత రాష్ట్రo ఉత్తర ప్రదేశ్ లో అత్యాచారాలకు పురిటి గడ్డగా మారింది..... కాంగ్రెస్

Submitted by Paramesh on Tue, 20/09/2022 - 16:00
 BJP-ruled Uttar Pradesh has become a breeding ground for rape.....Congress


నేరేడు చర్ల, సెప్టెంబర్ 20, (ప్రజా జ్యోతి):   బి.జె.పిపాలిత రాష్ట్రo ఉత్తర ప్రదేశ్ లో అత్యాచారాలకు పురిటి గడ్డగా మారిందనీ నేరేడు చర్ల కాంగ్రెస్ పార్టీ మండల యస్సి. సెల్ అధ్యక్షులు వుాట్కుారి సైదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలును విమర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరి జిల్లాలో దళిత అక్కాచెల్లెల్ల పై జునైద్ , సోహైల్ అనే యువకులు  అమానుశంగా అత్యాచారం చేసిన అనంతరం హత్యచేసి  చెట్టుకు వేలాడ తీసీ ఆత్మహత్యగా చిత్రీకరించడం   దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు.దేశంలో దిశ చట్టాలు అమలు చేస్తం అన్న కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలకి దళిత మహిళలపై జరుగుతున్న  ఇలాంటి అఘాయిత్యాలు ఆ ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని ఆయన అన్నారు.అదే ఒక అగ్రవర్ణ ఆడపడుచుకు ఇలాంటి సంఘటన జరిగితే నిందితులపై తుపాకీని హెక్కుపెట్టే పోలీస్  సజ్జనార్లు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. కానీ దళిత బహుజన ఆడపడుచులపై ఎన్ని హత్యలు అత్యాచారాలు జరిగిన ఒక్క పోలీస్ ఆఫీసర్ తుపాకీ కుాడా పేలక పోడవడం ఈ దేశ దౌర్భాగ్యం అని ఆయన అన్నారు.

ఈ బి.జె.పి పాలన దేశంలో ఉన్నంత వరకు కుల , మత బావాలతో హత్యలు  , అత్యాచారాలతో దేశం హింసా ఖాండ గా మారక తప్పదని  ఆయన అన్నారు.ఇకనైన ప్రభుత్వాలు మానవత్వాన్ని అవలంబించి కుల బావాలు లేకుండ అత్యాచార హత్యలకు పాలుపడినటువంటి వారికి దిశ చట్టాలు అమలుపరచి జునైద్ , సోహెల్  లను పబ్లిక్ లో ఉరి తీసి  ఆడపడుచులకు న్యాయం చేయాలని  ప్రభుత్వాన్ని కోరారు.