తెలంగాణ విముక్తి కోసం తెలంగాణలో నైజాం పాలనకు వ్యతిరేకంగాపోరాడిన కొంజేటి రంగక్కకు ఘనంగా సన్మానం
నేరేడు చర్ల సెప్టెంబరు 17 ప్రజా జ్యోతి . నేరేడు చర్ల మండల పరిధిలోని శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా పెంచికల్ దిన గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అధ్వర్యంలో సుంకర వాణి శ్రీరామ్ మూర్తి కొంజేటి సత్యవతి అలియాస్ రంగక్క కు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వాణి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం తెలంగాణలో నైజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో పెంచికల్ దిన్న గ్రామానికి విశిష్టమైన చరిత్ర ఉందని 15 మంది కి పైగా ఆనాటి పోరాటంలో పాల్గొని కొందరు వీరమరణం పొందారాన్నారు.ఆనాటి చరిత్రకు గుర్తుగా రంగకకు సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు.