Gurrampode

వినాయక మండపం వద్ద అన్నదానం చేసిన కుప్ప పృద్వీరాజ్.

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 15:38

గుర్రంపోడ్:సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి)  వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం మండల తెరాస యువజన విభాగం అధ్యక్షుడు కుప్ప పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య యాదవ్,వెలుగు యాదయ్య ముదిరాజ్,కుప్ప ఎల్లేష్, నాగరాజు,వార్డు మెంబర్లు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 13:19

గుర్రంపోడ్:సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి)  నిడమనూరు మండలం బొక్క ముంతల పహాడ్ గ్రామానికి చెందిన అన్న భీముని ప్రభాకర్ అన్నపూర్ణ ల కుమార్తె కిరణ్మయి జన్మదినం మరియు బుడుమర్లపల్లి గ్రామానికి చెందిన భిక్షాల మహేష్ శోభారాణిల కుమారుడు రిత్విక్ కుమార్ రెండవ జన్మదిన సందర్భంగా వారి సహకారంతో శుక్రవారం జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ లతీఫ్ సాహెబ్ గుట్ట వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు గాదె నరసింహ మాట్లాడుతూ..కిరణ్మయి, రిత్విక్ కుమార్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని,మన చుట్టూ ఉన్న పది మందికి అన్న

అన్నదానం మహాదానం:సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా.

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 12:50

గుర్రంపోడ్:సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి)అన్నదానం మహాదానమని గుర్రంపోడు మండలకేంద్ర సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా అన్నారు.వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గుర్రంపోడు మండల కేంద్రంలోని ఉడిపి హోటల్ ఎదురుగా ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య,తేలుకుంట్ల నరసింహ,గుమ్మడవెల్లి జగన్,యడవల్లి రమేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సాహితీ ఉన్నత శిఖరం కాళోజీ:మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 12:39

గుర్రంపోడ్:సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి)  తెలంగాణ సాహితీ ఉన్నత శిఖరం ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అని నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి  వెంకటేశ్వర్లు అన్నారు.కాళోజీ 108 వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాంచందర్ నాయక్ సన్మాన సభను విజయవంతం చేయాలి: వడిత్య నాగరాజు నాయక్.

Submitted by Sathish Kammampati on Wed, 07/09/2022 - 16:05

గుర్రంపోడ్:సెప్టెంబర్ 07(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 11వ తేదీన హాలియాలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ నందు అఖిలభారత బంజారా సేవా సంఘం మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ ట్రైకం చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ సన్మాన సభను విజయవంతం చేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి వడిత్య నాగరాజు నాయక్ పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించబడిన సమావేశంలో వడిత్య నాగరాజు నాయక్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత బంజారా సేవా సంఘం నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు బిక్షా న

ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by Sathish Kammampati on Wed, 07/09/2022 - 13:01

గుర్రంపోడ్:సెప్టెంబర్ 06(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండలంలోని జిన్నాయిచింత గ్రామపంచాయతీలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన నూతన గుర్తింపు కార్డులను మంగళవారం నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే తెరాస ప్రభుత్వ ధ్యేయం: మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by Sathish Kammampati on Wed, 07/09/2022 - 12:06

గుర్రంపోడ్:సెప్టెంబర్ 06(ప్రజా జ్యోతి)  గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే తెరాస రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నల్గొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు.

జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రావుల వెంకట నారాయణ గౌడ్ కు సన్మానం.

Submitted by Sathish Kammampati on Tue, 06/09/2022 - 14:35

గుర్రంపోడ్:సెప్టెంబర్ 05(ప్రజా జ్యోతి)  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కనగల్ మండల కేంద్రంలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తెలుగు ఉపాధ్యాయులు,పాత్రికేయులు రావుల వెంకటనారాయణ గౌడ్ ను జనయేత్రి ఫౌండేషన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు కంబాల శివలీల,ఫౌండేషన్ సభ్యులు బూరెల ప్రభాకర్ శాలువాతో సన్మానించి షీల్డ్ ను బహుకరించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కంబాల శివలీల మాట్లాడుతూ.. సమాజంలో పలు రంగాలలో విశేషంగా కృషి చేస్తున్న వారిని గుర్తించి సముచిత రీతిలో సన్మానించడమే జనయేత్రి ఫౌండేషన్ లక్ష్యమని తెలియజేశారు

వినాయక మండపం వద్ద పూజలు నిర్వహించిన మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by Sathish Kammampati on Tue, 06/09/2022 - 14:21

గుర్రంపోడ్:సెప్టెంబర్ 05(ప్రజా జ్యోతి).   వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డు నందు ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద సోమవారం నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు వినాయకుడికి పూజలు నిర్వహించి అనంతరం మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.అన్నదాన కార్యక్రమానికి సహకరించిన కాలనీవాసులకు,దాతలకు, గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీపాద సుధాకర్,ఎస్ ఐ బి శివప్రసాద్, స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా, ఉపసర్పంచ్ పగిళ్ల లాలయ్య, మండల తెరాస అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ

వినాయకుడికి పూజలు నిర్వహించిన రావుల బిక్షం-దుర్గమ్మ దంపతులు.

Submitted by Sathish Kammampati on Sun, 04/09/2022 - 16:41

గుర్రంపోడ్:సెప్టెంబర్ 04(ప్రజా జ్యోతి)వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలోని పాత ఊరు కాలనీ యందు కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ఆదివారం మండల కేంద్రానికి చెందిన రావుల బిక్షం-దుర్గమ్మ మరియు రావుల పరమేష్- గౌతమి దంపతులు వినాయకుడికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు.