వినాయక మండపం వద్ద అన్నదానం చేసిన కుప్ప పృద్వీరాజ్.
గుర్రంపోడ్:సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి) వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం మండల తెరాస యువజన విభాగం అధ్యక్షుడు కుప్ప పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య యాదవ్,వెలుగు యాదయ్య ముదిరాజ్,కుప్ప ఎల్లేష్, నాగరాజు,వార్డు మెంబర్లు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు