వినాయక మండపం వద్ద పూజలు నిర్వహించిన మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by Sathish Kammampati on Tue, 06/09/2022 - 14:21
Manchikanti Venkateswarlu performed the puja at Vinayaka mandapam.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 05(ప్రజా జ్యోతి).   వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డు నందు ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద సోమవారం నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు వినాయకుడికి పూజలు నిర్వహించి అనంతరం మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.అన్నదాన కార్యక్రమానికి సహకరించిన కాలనీవాసులకు,దాతలకు, గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీపాద సుధాకర్,ఎస్ ఐ బి శివప్రసాద్, స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా, ఉపసర్పంచ్ పగిళ్ల లాలయ్య, మండల తెరాస అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు,పగిళ్ల రమేష్, కమిటీ సభ్యులు మోపూరి ఆచారి, మురళి,మోపూరి లింగారెడ్డి, పోతన బోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.