తెలంగాణ సాహితీ ఉన్నత శిఖరం కాళోజీ:మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 12:39
Kaloji, the pinnacle of Telangana literature: Manchikanti Venkateshwarlu.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి)  తెలంగాణ సాహితీ ఉన్నత శిఖరం ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అని నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి  వెంకటేశ్వర్లు అన్నారు.కాళోజీ 108 వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా కవి కాళోజీ తన రచనలతో కవిత్వంతో సమకాలీన సామాజిక సమస్యల పట్ల జీవితాంతం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని, తెలంగాణ యాస, భాష,నుడికారం గొప్పదనాన్ని చాటి చెప్పిన సాహితీ ఉన్నత శిఖరం కాళోజి నారాయణ రావు అని,కాళోజి జయంతిని తెలంగాణ ప్రభుత్వం భాషా దినోత్సవంగా జరపడం సంతోషకరమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీపాద సుధాకర్, సూపరింటెండెంట్ అండాలు,ఏఈ శ్రీనివాస్,ఏపీఓ గోపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రవి, జూనియర్ అసిస్టెంట్ రావుల వెంకటేశ్వర్లు గౌడ్,పంచాయతీ కార్యదర్శులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.