గుర్రంపోడు మండలంలో జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమం.
గుర్రంపోడ్:సెప్టెంబర్ 19(ప్రజా జ్యోతి) ...
గుర్రంపోడ్:సెప్టెంబర్ 19(ప్రజా జ్యోతి) ...
గుర్రంపోడ్:సెప్టెంబర్ 19(ప్రజా జ్యోతి)../ యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా: రాములు నాయక్ అన్నారు.సోమవారం ఆయన దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఐ కేర్ క్లినిక్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కంటి వైద్యం కోసం దూర ప్రాంతం వెళ్లకుండా పట్టణంలోనే కంటి పరీక్షలు చేయించుకునేందుకు ఐ కేర్ క్లినిక్ తోడ్పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహకుడు ఎం.డి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడ్:సెప్టెంబర్ 19(ప్రజా జ్యోతి)../. గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.ఈ సమావేశంలో గుర్రంపోడు ఎంపీపీ, నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు,గుర్రంపోడు జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ లు పాల్గొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి విషయాలపై చర్చించారు.
గుర్రంపోడ్:సెప్టెంబర్ 18(ప్రజా జ్యోతి)../ బీసీ యువజన సంఘం నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన నకినబోయిన సతీష్ ముదిరాజ్ ను నియమించినట్లు బీసీ యువజన సంఘం నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు మోర మధు యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుర్రంపోడ్:సెప్టెంబర్ 18(ప్రజా జ్యోతి),, గుర్రంపోడు మండలంలోని నడికూడ గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు జనయేత్రి ఫౌండేషన్ కార్యవర్గ సభ్యుడు దాసోజు కృష్ణమాచారి మనవడు తేజేశ్వర్ జన్మదినం సందర్భంగా ఆదివారం నల్లగొండ లోని లతీఫ్ సాహెబ్ దర్గా వద్ద జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మంది యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కంబాల శివ లీల మాట్లాడుతూ.. అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా గొప్పదని అన్నారు.అన్నదాన నిర్వాహకులు దాసోజు కృష్ణమాచారి మాట్లాడుతూ..
గుర్రంపోడ్:సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి) అధికారులు,ప్రజా ప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని గుర్రంపోడు ఎంపీపీ,నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఏర్పాటుచేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. మండలంలోని వివిధ సమస్యలు,పనుల గురించి అధికారులకు,ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేసి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు.
గుర్రంపోడ్:సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విశిష్టమైన సేవలు అందించిన శ్రీపాద సుధాకర్ ఇటీవల చండూరు మండలానికి బదిలీ అయిన సందర్భంగా బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు ఎంపీడీవో సుధాకర్ ను శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా మంచికంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎంపీడీవో సుధాకర్ మండల అభివృద్ధి అధికారిగా పనిచేసి ప్రజాప్రతినిధులతో కలుపుగోలుగా ఉంటూ మండలాభివృద్ధికి విశేషమైన కృషి చేశారని పేర్కొన్నారు.
గుర్రంపోడ్:సెప్టెంబర్ 13(ప్రజా జ్యోతి) నల్లగొండ జిల్లా పీ.ఏ పల్లి మండలం రోలకల్లు గ్రామానికి చెందిన వీరమనేని లక్ష్మణరావు- కవిత దంపతులు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు మంగళవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వీరమనేని లక్ష్మణరావు -కవిత దంపతుల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గుర్రంపోడ్:సెప్టెంబర్ 13(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన జానయ్యను మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గుర్రంపోడు మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రావులపాటి భాస్కర్, చామలోని బావి సర్పంచ్ రేణుశ్రీ రామలింగం గౌడ్,చేపూరు సర్పంచ్ కట్టెబోయిన విజయ్,మొసంగి సర్పంచ్ యనమల కృష్ణ ప్రసాద్, తానేదార్ పల్లి సర్పంచ్ బొల్లు శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడ్:సెప్టెంబర్ 11(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన జాల యాదయ్య యాదవ్ కుమారుడు సందీప్-మౌనిక ల కుమారుడు రుద్రాంష్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ సన్నిధిలోని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు.ఈ జన్మ దిన వేడుకలకు గుర్రంపోడు జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించి శుభాశీస్సులు అందజేశారు.ఈ కార్యక్రమంలో వెలుగు వెంకటాద్రి ముదిరాజ్,బొమ్ము అశోక్,రావుల ఏడుకొండలు గౌడ్,ఇటికాల శ్రీనివాస్,మునగాల నరసింహ, పోలేపల్లి సైదులు,ఇటికాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.