జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 13:19
Food donation program under the auspices of Janayetri Foundation.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి)  నిడమనూరు మండలం బొక్క ముంతల పహాడ్ గ్రామానికి చెందిన అన్న భీముని ప్రభాకర్ అన్నపూర్ణ ల కుమార్తె కిరణ్మయి జన్మదినం మరియు బుడుమర్లపల్లి గ్రామానికి చెందిన భిక్షాల మహేష్ శోభారాణిల కుమారుడు రిత్విక్ కుమార్ రెండవ జన్మదిన సందర్భంగా వారి సహకారంతో శుక్రవారం జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ లతీఫ్ సాహెబ్ గుట్ట వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు గాదె నరసింహ మాట్లాడుతూ..కిరణ్మయి, రిత్విక్ కుమార్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని,మన చుట్టూ ఉన్న పది మందికి అన్నదానం చేసి ఆకలి తీర్చడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కంబాల శివలీల, కమిటీ సభ్యులు దాసోజు కృష్ణమాచారి,బూరెల ప్రభాకర్,ఏకాంబరాచారి,సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు.