57వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్ష లు
తెలకపల్లి, సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి ): మండల కేంద్రంలో వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మె సోమవారం 57వ రోజుకు చేరింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు గతంలో స్థానికంగా పనిచేసిన కొందరు వీఆర్వోలు దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు కార్యక్రమంలో జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి కే అంజనేయులు మండల జేఏసీ చైర్మన్ అశోక్ కో చైర్మన్ ఇబ్రహీం ప్రధాన కార్యదర్శి రాము సాయి బాలమ్మ సుల్తాన్ సైదులు భీమయ్య తదితరులు పాల్గొన్నారు.