Telkapalle

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:45

తెలకపల్లి, సెప్టెంబర్ 5 (ప్రజాజ్యోతి): మండల కేంద్రంలోని సిద్ధార్థ మోడల్ స్కూల్ వద్ద సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం విద్యార్థులు కరస్పాండెంట్  విజయ్ గౌడ్ ఉపాధ్యాయులను శాలువాలు పూలమాలలతో ఘన సన్మానం చేశారు.

కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:07

తెలకపల్లి,సెప్టెంబర్ 5 (ప్రజా జ్యోతి):మండలంలోని కార్వంగ జెడ్పి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తిరుమలేష్ సోమవారం కలెక్టర్ ఉదయ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు తిరుమలేష్ ను జెడ్పిటిసి పోతుగంటి భరత్ హెచ్ఎం రాజశేఖర్ రావు సహా ఉపాధ్యాయులు మిత్రులు అభినందనలు తెలిపారు.

కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు

Submitted by Ashok Kumar on Mon, 05/09/2022 - 18:01

తెలకపల్లి,సెప్టెంబర్ 5 (ప్రజా జ్యోతి):మండలంలోని కార్వంగ జెడ్పి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తిరుమలేష్ సోమవారం కలెక్టర్ ఉదయ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు తిరుమలేష్ ను జెడ్పిటిసి పోతుగంటి భరత్ హెచ్ఎం రాజశేఖర్ రావు సహా ఉపాధ్యాయులు మిత్రులు అభినందనలు తెలిపారు.

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:14

తెలకపల్లి, సెప్టెంబర్ 5 (ప్రజాజ్యోతి): తెలకపల్లి లో ఆదివారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి మరణించిన హమాలీ కార్మికుడు భోగరాజు భద్రయ్య అతని భార్య వెంకటమ్మ మృతుల కుటుంబాన్ని సోమవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి ఆర్డిఓ నాగలక్ష్మి తహసిల్దార్ తబితా రాణి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఇల్లు కూలిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు

భార్య కోసం టవర్ ఎక్కిన భర్త

Submitted by sridhar on Mon, 05/09/2022 - 09:49

తెలకపల్లి, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి ):భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురై సెల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలిపిన సంఘటన తెలకపల్లి మండలంలోని గట్టు రాయిపాకుల గ్రామంలో ఆదివారం జరిగింది ఎస్సై ప్రదీప్ కుమార్ గ్రామస్తులు తెలిపిన కథనం మేరకు గ్రామానికి చెందిన సుంకర లింగస్వామి భార్య జానకమ్మ మధ్య గొడవ జరిగింది కొన్ని రోజుల క్రితం పుట్టినిల్లు అయిన గన్యాగుల గ్రామానికి వెళ్ళిపోయింది తర్వాత తన భర్త పై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది