సిండికేట్ మద్యం అమ్మకాలు పట్టించుకోని అధికారులు

Submitted by Ashok Kumar on Mon, 19/09/2022 - 14:31
Officials who don't care about the sale of syndicated liquor

తెలకపల్లి, సెప్టెంబర్ 18 (ప్రజాజ్యోతి): . మండల కేంద్రంలో సిండికేట్ మద్యం అమ్మకాలతో ప్రజలు నష్టపోతున్నామని అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్యం దుకాణాలను అనుసరించి బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం వ్యాపారులు అధిక ధరలతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు అదేవిధంగా వివిధ చోట్ల అడ్డగోలుగా బెల్టు షాపులు నిర్వహిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు ఈ క్రమంలో రోడ్డు వెంట తరచు గొడవలు జరుగుతూ వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని సమస్యను అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు విమర్శిస్తున్నారు.