విశ్వకర్మ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 17:06
 MLA Marri participated in Vishwakarma Jayanti

తెలకపల్లి, సెప్టెంబర్ 17( ప్రజాజ్యోతి):  మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వారితో మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు అదేవిధంగా విశ్వకర్మలు కమ్యూనిటీ హాల్ భవనం మంజూరు చేయాలని కోరడంతో త్వరలో నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కార్యక్రమంలో డి సి సి బి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి బైకానీ శ్రీనివాస్ యాదవ్ విశ్వకర్మల సంఘం ప్రతినిధులు ఉమాపతి చార్యులు రామాచార్యులు ఎంపీపీ కొమ్ము మధు మాజీ జెడ్పిటిసి ఈదుల నరేందర్ రెడ్డి ఎంపీటీసీలు రమేష్ లక్ష్మమ్మ విజయలక్ష్మి నాయకులు భాషమోని రాములు చెన్న నరసింహ భాషమోని సత్యం తదితరులు పాల్గొన్నారు.