ప్రజావాణి పట్టని అధికారులు

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 14:45
Public officials

తెలకపల్లి,సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి):  తెలకపల్లి మండలంలో ప్రజావాణి కార్యక్రమం అధికారులు పట్టించుకోకుండా పోతున్నారు సోమవారం మండల కాంప్లెక్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి మండల సమైక్య కార్యాలయం సిసి నిరంజన్ మాత్రమే వచ్చి కూర్చున్నారు ఇతర శాఖల అధికారులు ఎంతకు రాకపోవడంతో తమ సమస్యలు విన్నవించడానికి వచ్చిన ప్రజలు ఆరు బయట కూర్చుని అధికారుల రాక కోసం నిరీక్షించారు.