సాయిధ పోరాటం పై బిజెపి విష ప్రచారం మానుకోవాలి
- చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సభలో సిపిఎం నాయకులు
పాలకుర్తి, సెప్టెంబర్ 10, ప్రజాజ్యోతి :- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పై బిజెపి విష ప్రచారం మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి. కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి వెంకటరాజ్యంలు అన్నారు. శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్ చౌరస్తాలో సిపిఎంఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.