కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది
హుజూర్ నగర్ సెప్టెంబర్ 26 (ప్రజా జ్యోతి): కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రయత్నిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు త్రిలోధకాలు ఇస్తుందని విమర్శించారు. బిజెపితేర రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం గాలికి వదిలేసి సప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.