కేసముద్రం సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి): అమీనాపురం ప్రాథమిక పాఠశాలలో 1993 -94 సంవత్సరం 7వ తరగతి బ్యాచ్ కి చెందిన విద్యార్థులు బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా గురువులు వీర సోమన్న రాజేంద్రప్రసాదలను సన్మానించారు. పాఠశాలకు 15వేల విలువైన మైక్ సెట్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆరిద్రపు శ్రీనివాస్, ఏలగలబోయిన మురళి యాదవ్, గుగ్గిళ్ళ శ్రీనివాసచారి, శోభారాణి, శ్రీనివాస్, ప్రభావతి ,మేనక, ప్రవీణ్, యాకమ్మ ,బాబు, ఎస్ శ్రీనివాస్, హెచ్ ఎం హాల్యా, రాధిక, పురం రమేష్ ,తరాల సంపత్, సోలాపురం యాకుబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.