బచ్చన పేట

కొడవటూరులో అట్ల బతుకమ్మ సంబరాలు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:36

బచ్చన్నపేట సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి)./... బచ్చన్నపేట మండలం . కొడవటూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రూప ఆధ్వర్యంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అట్ల బతుకమ్మ పండుగ సంబురాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారికి . అట్లు. దోశలు. నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు మహిళలు ఆటపాటలతో కోలాటాలతో అట్ల బతుకమ్మను సాగనంపారు

రైతులకు అవగాహన సదస్సు ... జిల్లా రైతుబంధు అధ్యక్షులు రమణారెడ్డి

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:30

బచ్చన్నపేట సెప్టెంబరు 29 (ప్రజా జ్యోతి) ./....బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలోని రైతు వేదికలో రైతులకు డివిజన్ స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనగామ జిల్లా రైతుబంధు అధ్యక్షులు ఇరి రమణారెడ్డి. జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ. వ్యవసాయ శాఖ అమలుపరుస్తున్న నాలుగు ఇంటర్వెన్షన్స్ అయినటువంటి పచ్చి రొట్టె ఎరువులు సాగు. వెదజల్లే పద్ధతిలో వరి సాగు.

ఒక్క నిఘా నేత్రం (సీసీ కెమెరా) వందమంది పోలీసులతో సమానం -- జనగామ డిసిపి సీతారాం

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:54

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి:  ఒక్క నిఘా నేత్రం (సీసీ కెమెరా) వందమంది పోలీసులతో సమానమని   జనగామ డిసిపి సీతారాం అన్నారు.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో బుధవారం రోజున పోచన్నపేట గ్రామపంచాయతీ వద్ద సీసీ కెమెరాలను డిసిపి సీతారాం ఏసిపి దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.25 సీసీ కెమెరాలను పోచన్నపేట గ్రామంలో పలు రోడ్లకు, పలు వీధులకు ఏర్పాటు కు  సహకరించిన దాతలను డిసిపి సీతారాం అభినందించారు.ఈ సందర్భంగా డిసిపి సీతారాం, ఎసిపి దేవేందర్ రెడ్డి లు మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల    నేరాల ను నియంత్రించవచ్చని అన్నారు.సిసి కెమెరాల ఏ

బచ్చన్నపేట రైతు వేదికలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు: జిల్లా వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:29

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చన్నపేటరైతు వేదికలో గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జనగామ జిల్లా వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి  అంజయ్య.

నాగిరెడ్డిపల్లి లో ఘనంగా దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:42

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి: తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ జనగాం జిల్లా  బచ్చన్నపేట మండలము నాగిరెడ్డిపల్లి లో ఘనంగా జరిగింది. దీనికీ రాజకీయ కుల సంఘ ప్రముఖులు పాల్గొన్నారు.విగ్రహ దాతలు కాస జహంగీర్ కాస రంజిత్ లు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోయేలా ప్రతి ఒక్క కురుమ గొల్ల యువకుడు పాటుపడాలని రాజకీయంగా ఎదగడం సాధ్యమని దానికి ముఖ్యంగా విద్య అవసరమని అన్నారు.

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు పుష్పగుచ్చం అందించిన వాస్విక్ ఫౌండేషన్ సభ్యులు...

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 13:16

బచ్చన్నపేట సెప్టెంబర్ 27.. ప్రజాజ్యోతి.//.... వాస్విక్ ఫౌండేషన్ ఛైర్మెన్ నిడిగొండ నరేష్ కుమార్  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా".జి.శ్రీనివాస్ రావును  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం వాస్విక్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న వైద్య అవగాహన సదస్సుల గురుంచి హెల్త్ క్యాంప్ ల గురుంచి,రక్త దాన శిబిరాల గురుంచి చర్చించడం జరిగింది.అదేవిధంగా ఈ నెల 29 వ తేదీన జనగామ జిల్లా లోని ఓబుల్ కేశపుర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత మల్టీ మెగా వైద్య శిబిరానికి రావలసిందిగా ఆహ్వానించడం జరిగింది.

ఘనంగా కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జయంతి వేడుకలు...

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 13:09

 బచ్చన్నపేట సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి.  స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుదు,  తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మంగళ వారం నాడు ఘనంగా నిర్వహించారు.బచ్చన్నపేట పొచ్చన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి పోచన్నపేట సర్పంచ్ గట్టు మంజుల మల్లేశం లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్యదర్శులు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన ముక్కెరతిరుపతిరెడ్డి..

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:06

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 ప్రజా జ్యోతి.///.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూరు గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఎంఆర్ హాస్పిటల్ మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు. సామాజిక సేవ కర్త ముఖ్యర తిరుపతిరెడ్డి సందర్శించి. వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స చేయించుకుంటున్న వారిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మండలంలోని మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి.

దొడ్డి కొమురయ్య విగ్రహానికి విరాళం అందించిన.. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 11:55

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి 10111. రూపాయలు విరాళంగా అందించినట్లు బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమికోసం. భుక్తి కోసం. తెలంగాణ ప్రజల కోసం రజాకారులతో పోరాటం చేసి అమరుడైన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య అన్నారు.