బచ్చన్నపేట సెప్టెంబర్ 27.. ప్రజాజ్యోతి.//.... వాస్విక్ ఫౌండేషన్ ఛైర్మెన్ నిడిగొండ నరేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా".జి.శ్రీనివాస్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం వాస్విక్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న వైద్య అవగాహన సదస్సుల గురుంచి హెల్త్ క్యాంప్ ల గురుంచి,రక్త దాన శిబిరాల గురుంచి చర్చించడం జరిగింది.అదేవిధంగా ఈ నెల 29 వ తేదీన జనగామ జిల్లా లోని ఓబుల్ కేశపుర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత మల్టీ మెగా వైద్య శిబిరానికి రావలసిందిగా ఆహ్వానించడం జరిగింది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ వాస్విక్ ఫౌండేషన్ ద్వారా మీరు చేపడుతున్న కార్యక్రమాలు చాలా భాగున్నాయి అని ప్రశంసించారు.అదేవిధంగా మా స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ మీరు చేసే ఇలాంటి సేవ కార్యక్రమాలకి నావంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
- 6 views