ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి- కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి).////. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టరు పమేలా సత్పతి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి జ్యోతి వెలిగించి ఆచార్య బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.