నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఫైళ్లకు వినతి

Submitted by krishna swamy on Thu, 15/09/2022 - 11:30
To grant funds Request for MLA files


భువనగిరి, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి)యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో  భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ నాయకత్వంలో హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయను కలసి గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీ వాసుల కోసం ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని , ఎస్సీ కాలనీలో సిసి రోడ్ల మరమ్మత్తులు , కొత్త రోడ్డు నిర్మాణం చేయాలని  కోరారు. అలాగే ఎస్సీ కాలనిలో ఊరపోచమ్మ గుడి నుండి స్మశాన వాటికలోని దహనవాటికల వరకు సుమారు 200 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణం చేయాలని ,  గ్రామంలో అక్కడక్కడ మిగిలిపోయిన సుమారుగా 200 మీటర్ వరకు సిసి రోడ్ల నిర్మాణం కూడా చేయాలని , గ్రామంలో ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని  కోరారు.

గ్రామాన్ని అనుకొని ఉన్న ఇరిగేషన్ పరిధిలోని చెరువును అభివృద్ధి చేసి చెరువు కట్టపై సిసి రోడ్లు , పాదాచారులు నడిచే విధంగా టైల్స్ వేసి అందుబాటులోకి తీసుకురావాలని , గ్రామం ముఖద్వారం నుండి మొదలుకొని ప్రధాన రహదారిపై బీటీ రోడ్లు కేవలం 12 ఫీట్లు ఉండగా రోడ్డుకు ఇరువైపులా మరో రెండు మీటర్ల చొప్పున సిసి నిర్మాణం చేపట్టాలని‌ వినతిపత్రంలో‌ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ , ఉప సర్పంచ్ నీల పోశెట్టి గౌడ్ , కాప్షన్ సభ్యులు కళ్ళెం కృష్ణ గౌడ్ , గౌడ సంఘం అధ్యక్షుడు బబ్బురి పోశెట్టి గౌడ్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి జక్కుల చంద్రయ్య యాదవ్ , నోముల నర్సింహ్మ యాదవ్ , వట్టిపల్లి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.