హనుమకొండ, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి),..// ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వరంగల్ కలెక్టర్ గోపీ, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్యా, అదనపు జాయింట్ కలెక్టర్ సంధ్యా రాణి తో కలసి దామెర లో గల ప్రతిమ హాస్పిటల్, హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అక్టోబర్ 1వ తేదీన ప్రతిమ హాస్పిటల్ ప్రారంభీస్తారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో భద్రత పకడ్బందీగా ఉండే విధంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
- 6 views