బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ
తుంగతుర్తి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తుంగతుర్తి వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ అన్నారు. మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అందజేస్తున్న బతుకమ్మ చీరలను మంగళవారం వైసీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ గ్రామ సర్పంచ్ నకిరేకంటి విజయ్ తో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలోని ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ కానుకగా ప్రతి సంవత్సరం చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మహిళా అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారని తెలిపారు. అందులో భాగంగానే మహిళా సంక్షేమానికి సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేయాలన్న ప్రాథమిక లక్ష్యంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేసీఆర్ విజయవంతంగా పూర్తి చేశారని,మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్టు పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- 2 views