గోవుల సంరక్షణ అందరి బాధ్యత

Submitted by narmeta srinivas on Tue, 15/11/2022 - 18:21
గోవుల సంరక్షణ అందరి బాధ్యత

గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు : మహేష్ అగర్వాల్

పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 15 : గోవుల సంరక్షణ అందరి బాధ్యత అని,గోవుల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి సంరక్షించాలని గోవుల సంరక్షణతోనే రైతుల మనుగడ సాధ్యమవుతుందని తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ అన్నారు. మంగళవారం కొడకండ్ల మండలంలోని నర్సింగాపురం గ్రామంలో యాకన్న గోశాల ఆధ్వర్యంలో సర్పంచ్ దండెంపెళ్లి శ్రీలతతో కలిసి రైతులకు గోవులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ రైతులు గోవులను పోషించుకోవడం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేసుకోవచ్చని ,తద్వారా రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా గో ఆధారిత సేంద్రియాలతో  బహుళ ప్రయోజనాలు పొందవచ్చని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం కూడా నెలకొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాడిపెళ్లి రాజేశ్వరరావు ,యాకన్న, గోశాల బాధ్యులు రాములు నాయక్ ,బాదావత్ యాకోబు నాయక్, రైతులు పాల్గొన్నారు.