పిడుగుపాటుకు మహిళ మృతి

Submitted by mahesh yadhav on Wed, 28/09/2022 - 09:13
Woman dies due to lightning

ప్రజా జ్యోతి నాగారం 27సెప్టెంబర్.//... పిడుగు పడి మహిళ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే నాగారం  మండలం బంగ్లా ఎక్స్ రోడ్ సమీపంలో  సాయంత్రం 4 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన  భారీ వర్షం పడింది. అదే సమయంలో పత్తి చేనులో పనిచేస్తున్న కాట్రేగుల గంగమ్మ (55) భారీ శబ్దం రావడంతో   అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా మహిళ కూలీలు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉండడంతో సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.   నాగారం ఎస్సై ముత్తయ్య  సంఘటన  స్థలానికి చేరుకొని పంచనామా నిమిత్తం శవాన్ని తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.