మునుగోడులో తెరాసా కుటుంబ ఆత్మీయ సమ్మేళనం

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 12:33
 Teresa's family spirit gathering in Munugodu

,,,కళాకారులతో కలిసి స్టెప్పులు వేసిన మాజీ ఎమ్మెల్యే,ఎంపీపీ
మునుగొడు సెప్టెంబర్ 23:(ప్రజాజ్యోతి)..// 
మునుగోడు మండల కేంద్రంలో తెరాసా కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం,వన బోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు.మండల కేంద్రంలో బోనాలు,బ్యాండ్, డోలు చప్పుళ్లతో  నిర్వహించిన బారి ర్యాలీలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని, డోలు దెబ్బ కళాకారులతో కలిసి డోలు వాయించగ,సభా ప్రాంగణంలో మునుగోడు ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ మహిళలతో కలిసి కోలాటం వేసి,యువకులతో తీన్మార్ డాన్స్ వేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశములోనే ఆదర్శంగా నిలిచాయనీ,రానున్న ఎన్నికల్లో తెరాసా అభ్యర్ధి అత్యధిక మెజారిటీతో గెలవడం కాయమని ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమములో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,నల్లగొండ మున్సిపల్ ఛైర్మెన్ సైదిరెడ్డి,తెరాసా రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్,అనంత లింగస్వామి గౌడ్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.