ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

Submitted by mallesh on Sat, 17/09/2022 - 16:51
 Telangana National Unity Day Celebrations

సెప్టెంబర్ 17 ప్రజా జ్యోతి. తెలంగాణ సమాజం నిజాం కబంధహస్తాల నుండి విమోచన పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అల్లాపురం సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినోత్సవం సందర్భంగా శనివారం అల్లాపురం గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి జాతీయ పథకాన్ని ఎగరవేశారు. జాతీయ సమైక్య దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రాసాల నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రజిత, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రామ్ రెడ్డి ఆశ వర్కర్ అమృత అంగన్వాడి ఉపాధ్యాయురాలు దివ్య కారోబార్ వల్లపు సాయి రాసాల యాదయ్య భూతం నరసింహ యంజాల వెంకయ్య, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.