క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని వినతి

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 17:59
Yellandu

 

జియం కార్యాలయ సిబ్బంది, కార్మికుల  సౌకర్యార్థం క్యాంటీన్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని గురువారం టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు ఎస్.రంగనాధ్ ఆధ్వర్యంలో జియం యం.షాలేము రాజు కు వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా ఎస్.రంగనాధ్ మాట్లాడుతూ గతంలో సిబ్బంది,కార్మికుల కొరకు క్యాంటీన్ ఉండేదని కొన్ని పరిస్థితుల వల్ల తీసివేయడం జరిగిందన్నారు.ఉదయమే కార్యాలయానికి వచ్చే సిబ్బందికి క్యాంటీన్ సౌకర్యం ఉండటం అవసరమని పేర్కొన్నారు. ప్రధానంగా జియం కార్యాలయ సమీపంలో ఎలాంటి అల్పాహార కేంద్రాలు అందుబాటులో లేవని తెలిపారు. తప్పనిసరిగా క్యాంటీన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరగా జియం స్పందించి తప్పకుండా క్యాంటీన్ ఏర్పాటు చేపిస్తానని తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో యాదగిరి, కోదండరామయ్య,అనిల్,దరియాసింగ్, సారంగపాణి,మెయిన్ భాష,శ్రీనివాసరెడ్డి, వీరన్న,విజయ్,రవి,సాంబయ్య,కిషోర్,సరోజ, కన్యాకుమారి,దుర్గ,అనూష,శారద,మంగ తదితరులు పాల్గొన్నారు.

Tags