మునుగోడు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి).//... నల్లగొండ జిల్లా:ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి బుధవారం మునుగోడు మండల పరిధిలో ఉన్న జమస్తాన్ పెళ్లి గ్రామంలోని ప్రజలకు గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ను లబ్ధిదారులు దుర్వినియోగం పరచకుండా సద్వినియోగం చేసుకొని కుటుంబాల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం కుటుంబం అభ్యున్నతికి తోడ్పడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కర్నాటి స్వామి యాదవ్, ఎంపీడీవో.శ్రీనివాస్ రెడ్డి, ఆర్ ఐ కత్తుల దుర్గ మహేశ్వరి, గ్రామ సర్పంచ్ నకరికంటి పద్మ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
- 4 views