అనుమానమే పెనుభూతమై భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:08
 Suspicion is the husband who brutally killed his wife

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): అనుమానంతో భార్యను నడిరోడ్డుపై కత్తితో  గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన ఘటన మహబూబాబాద్  జిల్లాలో గురువారం కలకలం రేపింది.   సీఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక భవాని నగర్ తండాకు చెందిన జాటోత్ భాస్కర్ కల్పన దంపతులకు ముగ్గురు కూతుర్లు. భాస్కర్ మాంసం దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా, కల్పన పలువురి ఇండ్ల ల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యపై అనుమానం కారణంగా భాస్కర్  కల్పన ల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణ లు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కల్పన పలువురి ఇళ్లల్లో పనిచేసేందుకు అడ్వకేట్స్ కాలనీకి వస్తున్న క్రమంలో రహదారిపై భార్యతో ఘర్షణ పడ్డాడు. భార్య మెడలోని పుస్తల తాడును  తెంపి కత్తితో  గొంతు కోసి పరారయ్యాడు. రక్తపుమడుగులో కొట్టుకుంటూ కల్పన అక్కడికక్కడే మృతి చెందింది.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బంధుమిత్రులు సంఘటన స్థలముకు చేరుకుని విలపించడం అందర్నీ కాలిచివేసింది.