వినాయక శోభయాత్రలో పాల్గొన్న సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్

Submitted by sudhakar on Thu, 15/09/2022 - 11:38
 Sub-Inspector Uday Kiran participated in Vinayaka Shobhayatra

అడ్డగూడూరు సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి న్యూస్) .స్థానిక అడ్డగూడూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర (ఎస్ వి ఆర్) వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ గణేష్ నవరాత్ర ఉత్సవాలు ముగియడంతో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా లడ్డూ లక్కీ డ్రా కూపన్ తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రా లో  సామ యాదిరెడ్డి దంపతులు15 కేజీల లడ్డును గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు చాలా భక్తిశ్రద్ధలతో అడ్డగూడూరు ప్రజలు జరుపుకున్నారని, ఈ పండుగ ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, ఐకమత్యం, క్రమశిక్షణకు తోడ్పడుతుందని అన్నారు.యూత్ సభ్యులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమం చేయాలని తెలిపారు. అనంతరం వినాయక శోభాయాత్ర ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.