తెలంగాణ రాష్ట్రంలో లారీ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర లారీ అసోసియేషన్ అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమద్ది రవిలు కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.లారీ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సింగిల్ పర్మిట్,గ్రీన్ టాక్స్ తదితర ప్రధాన సమస్యలపై మంత్రితో చర్చించారు.మంత్రి సానుకూలంగా స్పందించి లారీ ఓనర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు పేర్కొన్నారు.
- 9 views