నీట్ పరీక్షలో రాణించిన పోలీస్ హోంగార్డ్ తనయుడు

Submitted by veerareddy on Wed, 14/09/2022 - 16:39
Son of a police homeguard who topped the NEET exam

హనుమకొండ‌, సెప్టెంబర్14 (ప్రజాజ్యోతి). ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షలో రాణించిన హోంగార్డ్ కుమారుడి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి బుధవారం సత్కరించారు. వివరాల్లోకి వెలితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో హోంగార్డ్ విధులు నిర్వహిస్తున్న మార్గం శ్యాం కుమారుడు మార్గం మణికంఠ ఇటీవల ప్రకటించిన నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 720 మార్కులకు గాను 646 మార్కులు సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో తనకంటూ ఒక సీటును గ్యారేంటీ చేసుకున్నాడు. ఈ సందర్భంగా వరంగల్ నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి హోంగార్డ్ కుమారుడు మణికంఠను కమిషనరేట్ కార్యాలయములో వరంగల్ పోలీస్ కమిషనర్ పుష్పాగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించడంతో పాటు హోంగార్డ్ శ్యాంను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిరంతరం విధుల్లో బీజీగా వున్న తమ పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షలతో పాటు అన్ని రంగాల్లో పోలీస్ పిల్లలు రాణించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని. అదే విధంగా నీట్, జె.ఈ. ఈ అడ్వాస్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బంది పిల్లలందరికి పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో ఆర్.ఐ హోంగార్డ్స్ మరియు పోలీస్ సంక్షేమ ఆర్.ఐ నగేష్ పాల్గోన్నారు.