తాండూరు సెప్టెంబర్ ప్రజా జ్యోతి:- వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల బసవన్న కట్ట వద్ద ఏర్పాటు చేసిన దసరా పండుగ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భవాని మాత మంటపములో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బసవన్న కట్ట వద్ద అమ్మవారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శరన్నవరాత్రి ఉత్సవంలో ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు. అదే విధంగా మంటపం నిర్వాహకుల ఆద్వర్యంలో దర్శించు కోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని చెప్పారు .ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, కౌన్సిలర్లు ప్రవీణ్ కుమార్, మన్నపురం రామకృష్ణ, వెంకన్న గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ళ నర్సిములు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, పిఎసిఎస్ ఛైర్మెన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్,గడ్డల రవీందర్,బోయ రాజు, దర్మీది రవీందర్, బి.రఘు, అశోక్ ముదిరాజ్, రాములు, శ్రీకాంత్ రెడ్డి, హరిశ్వర్ రెడ్డి, రమేష్ సిందే, నారాయణ సిండే, సాయి రెడ్డి,సోము, లోకేష్, సీనియర్ నాయకులు,కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు.
- 8 views