రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో సోమవారం వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జియం కార్యాలయంలో ఎస్ఓటూ జియం బండి వెంకటయ్య వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృత భాషలో ఆదికవి, శ్రీరాముని చరిత్రను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని మనకు అందించిన మహర్షి వాల్మీకి అన్నారు.సింగరేణి వ్యాప్తంగా వాల్మీకి జయంతిని పండుగలా జరుపుకోవడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో ఏజిఎం(ఐఇడి)యం.గిరిధరరావు,డిజిఎం (పర్సనల్) జీవి.మోహన్ రావు,సివిల్ అధికారి డా. డి.ఆదినారాయణ,ధనుంజయ రెడ్డి,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి.శ్రీహరి,యంటి పర్సనల్ సాయి స్వరూప్, గుర్తింపు సంఘ ఉపాధ్యక్షులు ఎస్.రంగనాధ్,ఉద్యోగులు పాల్గొన్నారు.
- 9 views