సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా జెకె ఓసీలో సింగరేణి కాలరీస్ సంస్థ అభివృద్ధి కొరకు సర్వయాజమాన్య సహిత కార్మిక కుటుంబాల రక్షణ కొరకు అత్యంత వైభవంగా సోమవారం చండీయాగాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ బొల్లం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.ఈనెల 10 నుంచి 14 వరకు చండీయాగంలో భాగంగా వివిధ రకాల పూజాలు నిర్వహించనున్నారు.ఉదయం గణపతి పూజ,స్వస్తి పుణ్యవచనం,పంచాంగ వ్యప్రాసన,రక్షాబంధనం, అఖండ దీపారాధన, వాస్తు మండపారాధన, సాయంత్రం అగ్నిప్రతిస్టాపన,లక్ష్మి గణపతి హోమం, నీరాజన మంత్రపుష్పం మొదలైన పూజలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు.ఈకార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పంజాల శ్రీనివాసు,మేనేజర్ పి.పూర్ణ చందర్,శివప్రసాద్,శ్రీహరి,ఇతర అధికారులు, గుర్తింపు సంఘ ఉపాధ్యక్షులు ఎస్.రంగనాధ్, మున్సిపల్ చైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు,ఆలయ కమిటి సభ్యులు,ఉద్యోగులు పాల్గొన్నారు.
- 8 views